తెలంగాణ

telangana

ఆ రాష్ట్రంలో 78 గోవులు మృతి.. కారణమిదే!

By

Published : Nov 21, 2020, 8:35 PM IST

రాజస్థాన్​ చురూ జిల్లాలో అనుమానస్పదరీతిలో 78 గోవులు మృత్యువాతపడ్డాయి. విషపూరిత గ్రాసం తినటంవల్లే ఆవులు మరణించి ఉంటాయని పశువైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.

78 cows die of suspected food poisoning in Churu's govt-aided shelter: Official
రాజస్థాన్​లో 78గోవులు మృతి... కారణం ఇదే !

రాజస్థాన్​ చురూ జిల్లా రాం​పురా గ్రామంలోని ఓ ప్రైవేట్​ గోశాలలో గోవులు అనుమానస్పదంగా మృతిచెందాయి. శుక్రవారం రాత్రి నుంచి మొత్తం 78 ఆవులు మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని గోవులు అస్వస్థతతో ఉన్నట్లు పేర్కొన్నారు.

విషపూరిత గ్రాసం తినటం వల్లే గోవులు మరణించి ఉంటాయని పశు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆవులు తిన్న గ్రాసాన్ని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు​ పంపించామన్నారు.

గోపాష్టమికి ముందురోజు ఇలా జరగటంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details