జాతీయ నేర నమోదు విభాగం (ఎన్సీఆర్బీ)తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2019లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో నేరాలు 7.3శాతం పెరిగాయి. ఈ నగరాల్లో 2018లో మొత్తం నేరాల సంఖ్య 8,02,267 కాగా 2019లో ఆ సంఖ్య 8,60,960కి పెరిగింది. వీటిలో 6,04,897కేసులు భారత శిక్షాస్మృతి చట్టం కింద నమోదు కాగా.. 2,56,063కేసులు ప్రత్యేక,స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి.
అధిక నేరాలు నమోదైన నగరాలు
1. దిల్లీ -3,11,092కేసులు
2. చెన్నై -71,949కేసులు
3. అహ్మదాబాద్ -53,538కేసులు
4. బెంగళూరు -41,854కేసులు
5. కోయంబత్తూర్ -15,821కేసులు