తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: లోయలో పడిన బస్సు- అయిదుగురు మృతి

ముంబయి-పుణె రహదారిపై తెల్లవారుజామున ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో అయిదుగురు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.

By

Published : Nov 4, 2019, 9:36 AM IST

Updated : Nov 4, 2019, 12:52 PM IST

మహారాష్ట్ర: లోయలో పడిన బస్సు- అయిదుగురు మృతి

మహారాష్ట్ర: లోయలో పడిన బస్సు- అయిదుగురు మృతి

మహారాష్ట్రలోని భోర్​ఘాట్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరాడ్​ నుంచి ముంబయి వెళ్తోన్న ఓ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో భోర్​ఘాట్​ వద్ద మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసు అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : 'మహా' ప్రతిష్టంభన: నేడు దిల్లీకి పవార్​, ఫడణవీస్

Last Updated : Nov 4, 2019, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details