దేశ రాజధాని దిల్లీలోని ఆర్మీ ప్రీమియర్ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి సిబ్బందిలో 24 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ప్రస్తుతం అదే ఆసుపత్రిలో సేవలందిస్తున్న వారితో పాటు విశ్రాంత సాయుధ దళ సిబ్బంది కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరందరికీ దిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ బేస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ముందుగా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలగా.. వెంటనే అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించి పరీక్షలు జరిపారు.