దేశంలో కరోనా రోజురోజుకూ ఉద్ధృతం అవుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
తమిళనాడులో వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్కరోజే 4,807 మంది కరోనా బారినపడ్డారు. మరో 88 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,65,714కు చేరగా... 2,403 మంది కరోనాతో చనిపోయారు.
ఉత్తర్ప్రదేశ్లోనూ మహమ్మారి విస్తరిస్తోంది. శనివారం మరో 1,673 మందికి వైరస్ సోకింది. 24 మందికిపైగా మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 47,036 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1,108కు చేరింది.