సముద్రపు దొంగలకు (పైరేట్స్) చిక్కిన పద్దెనిమిది మంది భారతీయులు విడుదల అయ్యారని నైజీరియాలోని భారత హైకమిషన్ వెల్లడించింది.
ఇదీ జరిగింది.
డిసెంబరు మూడో తేదీన నైజీరియా తీరంలో హాంకాంగ్ పడవలోని 19 మందిని సముద్రపు దొంగలు అపహరించారు. అందులో పద్దెనిమిది మంది భారతీయులు. ఏఆర్ఎక్స్ మారిటైమ్ సంస్థ ఈ వివరాలను తెలిపింది.
పైరేట్స్ నుంచి 18 మంది భారతీయుల విడుదల
"డిసెంబరు 3వ తేదీన సముద్రపు దొంగలు అపహరించిన 18 మంది భారతీయులను విడుదల చేస్తున్నట్లు నైజీరియన్ నౌకదళం, షిపింగ్ కంపెనీ ధ్రువీకరించింది. బంధితులను సురక్షితంగా విడుదల చేసేందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు."
-భారత హై కమిషన్ ట్వీట్
బందీలైన భారతీయులు సురక్షితంగా బయటపడేందుకు.. నైజీరియాలో ఉన్న భారత హై కమిషన్.. అఫ్రికన్ దేశాల అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి : ఝార్ఖండ్లో ఫలితాలు రేపే-హస్తం వైపే ప్రజల మొగ్గు!