రాజస్థాన్ ధోల్పూర్ జిల్లాలో లోక్ అదాలత్ చొరవతో.. విడిపోయిన పది జంటలు మళ్లీ కలిశాయి. జిల్లా న్యాయసేవా ప్రాధికారసంస్థ వారి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కోర్టులో.. న్యాయమూర్తి వారి మధ్య రాజీ కుదిర్చారు. అనంతరం దంపతులు పరస్పరం పూలదండలు మార్చుకొని ఒక్కటయ్యారు.
ధోల్పూర్ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్లో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించారు. ఈ క్రమంలో గొడవల కారణంగా విడిపోయిన 10జంటలు సహా ఇతర 6కేసుల్లో కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చారు న్యాయమూర్తి. కలహాల కారణంగా చాలాకాలం దూరంగా ఉన్న దంపతులు కలుసుకోగా.. వారి ఆనందానికి అవధుల్లేవు.
భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని...