స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ జయంతి(Bhagat singh Jayanthi) సందర్భంగా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించిందని, ప్రతి భారతీయుడి హృదయంలో ఆయన జీవించే ఉన్నారని ట్విట్టర్(Modi tweet on Bhagat Singh) వేదికగా కొనియాడారు మోదీ.
"ప్రతి భారతీయుడి హృదయంలో భగత్సింగ్ జీవించే ఉన్నారు. ఆయన సాహసోపేతమైన త్యాగం ఎంతో మంది ప్రజల్లో దేశభక్తిని రగిలించింది. భగత్సింగ్ జయంతి సందర్భంగా.. ఆనయన ఆదర్శాలను గుర్తుచేసుకుంటున్నాను."
- ప్రధాని నరేంద్ర మోదీ
స్ఫూర్తిదాత
భగత్సింగ్ 114వ జయంతి(Bhagat Singh birth anniversary) సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Bhagat Singh Amit shah).. ఆయనకు ఘన నివాళులర్పించారు. భగత్ సింగ్ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారని ట్వీట్ చేశారు షా.
"భగత్సింగ్ తన జీవితం కన్నా.. దేశ స్వేచ్ఛ, గౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఆయన చిన్న వయస్సులోనే ధైర్యం, విప్లవాత్మక ఆలోచనలతో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి గొప్ప చిహ్నంగా మారారు. అంతేకాదు ఆయన దేశభక్తి భారతీయులకు స్ఫూర్తి."