తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2021, 4:47 PM IST

ETV Bharat / bharat

'అమిత్‌ షా'కు బంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు

తృణమూల్‌ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో కేంద్ర హోం మంత్రి అమిత్​ షాకు సమన్లు జారీ చేసింది బంగాల్​ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్‌ ద్వారా హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

Amit Shah summoned by special court in defamation case filed by TMC's Abhishek Banerjee
అమిత్‌ షాకు బంగాల్‌ కోర్టు సమన్లు

కేంద్ర హోం మంత్రి 'అమిత్‌ షా'కు సమన్లు జారీ చేసింది బంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

తృణమూల్‌ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని పేర్కొంది.

2018 ఆగస్టు 11న కోల్​కతాలో భాజపా చేపట్టిన ఓ ర్యాలీలో బెనర్జీని కించపరిచేలా అమిత్​ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్​ సంజయ్​ బసు ఆరోపించారు.

ఇదీ చూడండి:నేతాజీ జీవితం.. భవిష్యత్​ తరాలకూ ఆదర్శం: షా

ABOUT THE AUTHOR

...view details