కేంద్ర హోం మంత్రి 'అమిత్ షా'కు సమన్లు జారీ చేసింది బంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని పేర్కొంది.