కర్ణాటక బెంగళూరులో కరోనా మరణాలపై బీబీఎమ్పీ(బృహత్ బెంగళూరు మహానగర పాలిక) నిర్వహించిన ఆడిట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. గత 20 రోజుల్లో 778మంది కరోనాతో మృతిచెందారని ఆడిట్ తెలిపింది. వీరిలో చాలా మంది ఇంటి వద్దే మరణించినట్లు పేర్కొంది. ఇది ఆందోళనకరమైన విషయం అని పేర్కొంది. చికిత్స తీసుకోక, అసలు వ్యాధి సోకిందని తెలియక అనేకమంది మరణించారని వెల్లడించింది.
ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు బీబీఎమ్పీ కమిషనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. అయితే ఇందులో బీబీఎమ్పీ వైఫల్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.