ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి

రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కడప జిల్లా బద్వేలు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మరో యువకుడు గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

By

Published : Sep 3, 2019, 10:28 PM IST

ఇద్దరు యువకులు మృతి

ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా బద్వేల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిది రఘనాథపురం కాగా... మరొకరిది నాగిశెట్టిపల్లిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details