ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2021, 11:06 AM IST

Updated : Sep 30, 2021, 4:00 PM IST

ETV Bharat / state

RED SANDAL: ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

కడప జిల్లాలో టాస్క్ ఫోర్స్, అటవీ అధికారులు చేపట్టిన దాడుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

RED SANDEL
RED SANDEL


కడప ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

కడప జిల్లా వేంపల్లెకు చెందిన రమణ, మధుసూదన్ నాయుడు నిన్న రాత్రి ఇడుపులపాయ అటవీ ప్రాంతం సమీపంలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తుండగా పోలీసులకు చిక్కారు. అధికారులను గమనించిన నిందితులు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నించి పారిపోతుండగా పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.

Last Updated : Sep 30, 2021, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details