ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​ఈబీ దాడుల్లో నాటుసారా స్వాధీనం... ముగ్గురు అరెస్టు

కడప జిల్లా కోడూరు మండల పరిధిలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేర్వేరు చోట్ల పదిహేడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సెబ్​ ఇన్​స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు.

By

Published : May 22, 2021, 7:55 PM IST

cheap liquor
పోలీసుల అదుపులో నిందితులు

కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలో ఎస్​ఈబీ ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్.. తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓబులవారిపల్లె మండలం తల్లెంవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ప్లాస్టిక్​ క్యాన్​లో తరలిస్తున్న పది లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు సెబ్​ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు.

మరోచోట ముత్తరాసుపల్లి సమీపంలో ఏడు లీటర్ల నాటుసారా సీజ్​ చేసి.. ఒక వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి.. నందలూరు కోర్టులో హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్​ విధించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details