ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్​ఆర్ చిత్రపటం లేదని విద్యార్థుల ఆందోళన

విశ్వవిద్యాలయ వార్షికోత్సవంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వేదికపై బైఠాయించి జోహార్ వైఎస్​ఆర్ అంటూ నినాదాలు చేశారు.  చివరికి వైఎస్ఆర్ ఫోటోను అధికారులు ఏర్పాటు చేసినందున విద్యార్థులు శాంతించారు. ఈ ఘటన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది.

By

Published : Mar 9, 2019, 1:32 PM IST

వైఎస్ చిత్రపటం ఏర్పాటు చేయాలని విద్యార్థుల నిరసన

కడప యోగి వేమన విశ్వవిద్యాలయ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు. అధికారులు యోగివేమన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దాని పక్కనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్​రెడ్డి చిత్రపటాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ విద్యార్థి సంఘ నాయకులు సమావేశం జరుగుతుండగా ఉపకులపతి రామచంద్రారెడ్డి వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. వైఎస్​ఆర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ వేదికపైనే బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పిన వినలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారినందున.. ఎట్టకేలకు అధికారులు వై.యస్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాల వేశారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details