కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రక్రియ మొదలైంది. ఆర్జీయు కేటీ డైరెక్టర్ సుదర్శన్ రావు పర్యవేక్షణలో ఈ అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రవేశాల కోసం బాలికలు 298 మంది, బాలురు 170 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదట అడ్మిషన్ పొందిన విద్యార్థి పి.దిల్ శ్రీకి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సుదర్శన్ రావు ఐడీ కార్డును లాంఛనంగా అందించారు.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ప్రారంభం
రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు మొదటిరోజు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 1000 మంది విద్యార్థులకు గాను నేడు 468 మందికి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది.
ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మొదలైన అడ్మిషన్ల ప్రక్రియ