ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం... విశ్రాంత ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో ఆదాయ పన్నుశాఖ విశ్రాంత అధికారి మృతి చెందారు. కడప నుంచి రాజంపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

By

Published : Apr 22, 2019, 7:30 PM IST

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి

కడప జిల్లా సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఆదాయ పన్నుశాఖ అధికారి కృష్ణమూర్తి మృతి చెందారు. కడప నుంచి రాజంపేట వైపు కృష్ణమూర్తి తన కారులో వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ఇరుక్కుపోయిన కృష్ణమూర్తిని అతికష్టం మీద బయటికి తీసిన స్థానికులు కడప రిమ్స్ కు తరలించారు. కృష్ణమూర్తి చికిత్స పొందుతూ మరణించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details