ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంగన్​వాడీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద మృతి

అంగన్​వాటీ ఉపాధ్యాయురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉరేసుకున్న స్థితిలో ఉన్న ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా... లేక ఎవరైనా హత్య చేశారా! అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Jul 13, 2019, 11:43 AM IST

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి.. భర్తే నేరస్థుడా!

కడప జిల్లా బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో అంగన్​వాడీ టీచర్​గా పని చేస్తున్న ప్రశాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తే హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తున్నారు. బద్వేలు మండలం చెన్నంపల్లి దళితవాడకు చెందిన ప్రశాంతికి ఐదేళ్ల కిందట వివాహమైంది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద మృతి.. భర్తే నేరస్థుడా!

ABOUT THE AUTHOR

...view details