ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుడు మృతి

కడప జిల్లా రాయచోటి పట్టణం వరిగ కూడలి రింగ్​ రోడ్డు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

By

Published : May 12, 2019, 7:16 AM IST

లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుని మృతి

లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుని మృతి

కడప జిల్లా రాయచోటి పట్టణం వరిగ కూడలి రింగ్​ రోడ్డు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. రాయచోటి పురపాలక పరిధిలోని మునియప్ప గారి పల్లికి చెందిన వెంకటేశ్​ హీరో షోరూమ్​లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో లారీ ఢీ కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్​ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ బోల్తా పడడంతో కడప మదనపల్లి వైపు రాకపోకలు రెండు గంటల పాటు నిలిచాయి. లారీలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. లారీని, బస్తాలను తొలగించి ట్రాఫిక్​ పునరుద్ధరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details