తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటించటంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆచంట నియోజకవర్గంలో అభ్యర్థి మంత్రి పితాని సత్యనారాయణ ప్రచారం చేశారు.
By
Published : Mar 15, 2019, 11:49 PM IST
మంత్రి పితాని ఎన్నికల ప్రచారం
మంత్రి పితాని ఎన్నికల ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట తెదేపా అభ్యర్థి మంత్రి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారం చేశారు. పెనుతంత్ర మండలం మార్టేరులో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు.తాను పార్టీమారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ధైర్యంగా ప్రజాక్షేత్రంలో పోటీచేసి గెలవాలి కాని.. ఇలాంటి నీతిమాలిన పనులు చేయవద్దని ప్రత్యర్థులకు సూచించారు.