ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే రాజధాని మునిగింది - botsa

గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే రాజధాని మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు.

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కలిసిన బొత్స

By

Published : Aug 22, 2019, 2:38 PM IST

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజధాని నిర్మాణం జరగలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను మర్యాద పూర్యకంగా కలుసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగానే రాజధాని ముంపుకు గురైందన్నారు. ఈ అనంతరం ఎమ్మెల్యే కొట్టు సత్యన్నారాయణ పట్టణంలోని సమస్యలను బొత్స దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననీ వెల్లడించారు.

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కలిసిన బొత్స

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details