ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా ఎఫెక్ట్: తణుకులో బంద్​

By

Published : Aug 16, 2020, 3:45 PM IST

తణుకు నియోజకవర్గ పరిధిలో 8 వందలకు పైగా కరోనా కేసులు నమోదు కావటంతో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆదివారం రోజున ఔషధ దుకాణాల మినహా నిత్యావసర వస్తువుల దుకాణాలతో సహా అన్ని దుకాణాలు మూయించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ పట్టణాల్లోనే కాకుండా రేయింబవళ్ళు సిబ్బందిని పహారా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

కరోనా ఎఫెక్ట్: తణుకులో బంద్​
కరోనా ఎఫెక్ట్: తణుకులో బంద్​

కరోనా ఎఫెక్ట్: తణుకులో బంద్​

కరోనా నివారణ నేపథ్యంలో భాగంగా తణుకు, అత్తిలి, ఇరగవరంలో అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు ఔషధ దుకాణాలకు మినహాయింపు నిచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూసివేశారు. వైద్య అవసరాల కోసం వచ్చే వారిని మాత్రం పట్టణంలోనికి అనుమతించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం పూర్తి బంద్​ పాటించాలని, మంగళ, శుక్రవారాలు నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహాయించి మిగిలిన అన్ని దుకాణాలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమ, బుధ ,గురు, శని వారాలలో మాత్రమే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చునని నిబంధనలలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details