ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు

జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సాయుధ బలగాలు పిలుపునిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు చేసి అందరికీ అవగాహన కల్పించారు.

By

Published : Mar 28, 2019, 4:34 PM IST

Updated : Mar 29, 2019, 5:27 AM IST

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు

పశ్చిమలో సాయుధ బలగాల కవాతు
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో కేంద్ర సాయుధ బలగాలు కవాతు చేశాయి. జీలుగుమిల్లి, ములగలంపల్లి స్వర్ణ వారి గూడెం ప్రాంతాల్లో ఓటర్లకు శాంతిభద్రతలపై అవగాహన కల్పించాయి. ఎస్సై వీరబాబు ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది.. ప్రదర్శనగా వెళ్లారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Last Updated : Mar 29, 2019, 5:27 AM IST

ABOUT THE AUTHOR

...view details