ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాలూరులో బయలుదేరిన బస్సులు

విజయనగరం జిల్లా సాలూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్​ అనంతరం కరోనా నియంత్రణలో భాగంగా పలు మార్పుల అనంతరం ఈరోజు ఉదయం 7 గంటలకు 17 సర్వీసులు బయలుదేరాయి.

By

Published : May 21, 2020, 11:53 AM IST

Published : May 21, 2020, 11:53 AM IST

buses started after lock down
సాలూరు డిపో నుంచి మొదలైన బస్సు సర్వీసులు

లాక్​డౌన్​ అనంతరం విజయనగరం జిల్లా సాలూరు ఆర్టీసీ డిపో నుంచి బస్​ సర్వీసులు ప్రారంభించారు. 17 బస్ సర్వీసులుకు గాను సాలూరు నుంచి విశాఖకు 6, బొబ్బిలి నుంచి పార్వతీపురానికి, సాలూరు నుంచి శ్రీకాకుళం, బొబ్బిలి నుంచి విశాఖ​, శ్రీకాకుళం నుంచి పార్వతీపురానికి రెండేసి బస్సులు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ప్రయాణికులకు కరోనా వ్యాపించకుండా భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బస్సులో కూర్చునే సీటు విధానాన్ని పూర్తిగా మార్పు చేశారు. బస్సుల్లో ప్రయాణించేవారికి శానిటైజర్స్​, మాస్కులు ఇచ్చి ఆర్టీసీ సిబ్బంది పలు సూచనలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details