ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం

By

Published : Jan 11, 2021, 5:35 PM IST

పట్టా భూములను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వోని ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఈ ఘటన విజయనగరం జిల్లా, బలిజిపేట మండలం, అంపవల్లిలో జరిగింది.

ACB officials nab VRO taking bribe ampavalli in vizianagaram district
ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం

విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని అంపవల్లి వీఆర్వో.. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ వలకు చిక్కాడు. పట్టా భూములను ఆన్​లైన్​లో నమోదు చేసేందుకు రవీంద్ర అనే రైతు అంపవల్లి వీఆర్వోను సంప్రదించాడు. అతను రూ. 4 వేల లంచం ఇవ్వాలని కోరగా.. భూ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రైతు.. వీఆర్వోకి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details