ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర
నదులు చెరువులు పరిరక్షణ యాత్ర విశాఖలో ముగిసింది. మెగసెస్ అవార్డు గ్రహీత, వాటర్ మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ ఉత్తరాంధ్రలో మూడు రోజులు పర్యటించారు. అనంతరం పరిశీలన చేసిన అంశాలను విశాఖలో ప్రముఖులతో పంచుకున్నారు. సోమవారం సాయంత్రం పౌర గ్రంథాలయం వేదికగా డాక్టర్ రాజేంద్ర సింగ్ పర్యావరణవేత్తలతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అనేక నీటివనరులను అస్తవ్యస్తం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. సీఎం జగన్ మోహన్రెడ్డికి ఒక నివేదిక ఇచ్చి ఉత్తరాంధ్రలో నీటి పరిరక్షణకు కృషి చేయాలని కోరతానని చెప్పారు.
ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర
.