ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రిన్సిపల్ స్పందించ లేదు.. మీరైనా  చొరవ తీసుకోండి'

ప్రభుత్వ భూములే కాదు.. ప్రభుత్వ కళాశాల స్థలాలూ వదిలి పెట్టడం లేదు కొందరు వ్యక్తులు. మరక్కడి ప్రిన్సిపల్ ఉన్నారుగా.. పోలీసులకు ఫిర్యాదు చేయ్యలేదా...? కేసు పెట్టలేదా... ? అంటే నిజమే .. కానీ...ఆయన కూడా కబ్జాదారులతో కుమ్మక్కయ్యారనే విమర్శ ఉంది. అందుకే ఆ కళాశాల విద్యార్థులంతా సీఎంకు మొరపెట్టుకున్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఆక్రమణపై ధర్నా...

By

Published : Jul 11, 2019, 2:00 PM IST

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ఆక్రమణపై ధర్నా...

విశాఖలోని విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని జన జాగరణ సమితి కార్యకర్తలు, కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కాలేజీ భూమిని కబ్జా చేసి, చుట్టూ ప్రహరీ నిర్మించినా... కళాశాల ప్రిన్సిపల్ చోద్యం చూడ్డంపై ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వీటిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులపై ప్రభుత్వ చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పి, ప్రహరీని కూలగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details