ఇదీ చదవండి:
ఇళ్ల స్థలాలు స్థానికులకే కేటాయించాలని గ్రామస్థుల ఆందోళన
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెద్దిపాలెంలో తమ గ్రామానికి చెందిన స్థానికులకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కొండ ప్రాంతాన్ని చదును చేసి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. సమీప గ్రామాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. తమ గ్రామానికి చెందిన పేదలకు మాత్రమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. లేదంటే పనులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.
ఇళ్లన్ని తమకే కేటాయించాలని..గ్రామస్తుల ఆందోళన