విశాఖ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో మరణించిన కెమిస్ట్ శ్రీనివాస్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన.. ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాంకీ ఎస్ఈజెడ్లో 15 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఈ ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి: నారా లోకేశ్
విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆయన.. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి: నారా లోకేశ్
TAGGED:
visakha fire accidents news