ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 25, 2020, 9:00 PM IST

ETV Bharat / state

తాండవ జలశయంలో చేపపిల్లల విడుదల

విశాఖ జిల్లా నాతవరంలోని తాండవ జలాశయంలో అధికారులు 4 లక్షల 20 వేల చేపపిల్లలను వదిలారు. సుమారు 500 మత్స్య కుటుంబాలకు జీవనోపాధి దొరకనున్నట్లు తెలిపారు. దశల వారీగా అన్ని జలశయాల్లో చేపల పెంపకం చేపడతామని స్పష్టం చేశారు.

Release of fish into Thandava reservoir
చేపపిల్లలు విడుదల

విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ జలాశయంలో మత్స్య శాఖ సహాయ సంచాలకులు విజయ్ కృష్ణ చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని 4 లక్షల 20 వేల చేపపిల్లలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. సుమారు 500 కుటుంబాలకు జీవనోపాధి దొరుకుతుందని వివరించారు. ఆరు నెలల కాలంలోనే అవి రెండు నుంచి మూడు కిలోల బరువు పెరుగుతాయన్నారు.

చీడికాడ మండలం కోనాం జలాశయంలోనూ చేప పిల్లలను విడుదల చేస్తామన్న ఆయన, దశలవారీగా అన్ని జలశయాల్లో చేపల పెంపకం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details