ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2020, 1:58 PM IST

ETV Bharat / state

వంతెనపై నుంచి రాకపోకలు ప్రారంభించండి: మంత్రి బొత్స

నేటి నుంచి విశాఖ ఎన్​ఏడీ జంక్షన్ వద్ద నిర్మించిన వంతెనపై నుంచి రాకపోకలు ప్రారంభించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

minister Botsa Visit NAD Fly over
వంతెన పనుల పరిశీలించిన మంత్రి బొత్స

విశాఖ ఎన్ఏడీ జంక్షన్ వద్ద రూపుదిద్దుకున్న వంతెనపై రాకపోకలు నేటి నుంచి ప్రారంభించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును విజయ్ నిర్మాణ సంస్థ పూర్తి చేస్తోంది. పారిశ్రామిక ప్రాంతం, ఎయిర్ పోర్టు, గోపాలపట్నం, మర్రిపాలెం జాతీయ రహదారి వీటన్నింటినీ జంక్షన్​గా ఎన్​ఏడీ ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఈ జంక్షన్ కిటకిటలాడుతోంది. ఈ రద్దీని నివారించటానికి రెండేళ్ల కిందట వలయాకారపు పై వంతెన నిర్మాణం చేపట్టారు. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు ఆలస్య నివారణ చర్యలను ప్రభుత్వం చేపట్టింది. త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గుత్తేదారులకు నిర్దేశించింది. ఇప్పటికే పూర్తయిన వైపు ట్రాఫిక్​ను అనుమతిస్తున్నారు. ఈ రోజు నుంచి అన్ని వైపుల నుంచి ట్రాఫిక్ అనుమతించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. నాణ్యతా లోపాలు పరిశీలించి....పై వంతెన కింద రహదారి పనులు అన్నింటినీ
సకాలంలో పూర్తి చేయాల్సిందిగా స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details