ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు.
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేశాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం జామిగుడలో జరిగిన ఈ ఘటనలో... 14 మంది గాయపడ్డారు. పనిలో ఉండగా ఒక్కసారిగా ఈగలు చెలరేగాయని కూలీలు తెలిపారు. వాటిని చూసి ఊరివైపు పరుగు తీసి.. ఓ ఇంట్లో దాక్కున్నామని తెలిపారు. ఈగల దాడిలో గాయపడిన గ్రామస్థులు... వైద్యం కోసం పాడేరు ఆసుపత్రిలో చేరారు.