ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"శ్వేత పత్రాలతో సరిపెట్టొద్దు.. విచారణ చేయాలి"

గత ప్రభుత్వ అవినీతిపై శ్వేత పత్రాలతో సరిపెట్టొద్దని... విచారణ చేపట్టాలని భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సూచించారు. భాజపాలోకి వచ్చేవారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

By

Published : Jul 11, 2019, 11:51 PM IST

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ

విశాఖ భాజపా కార్యాలయంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగిస్తూనే జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని కోరారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, అరాచకాలపై సీబీఐ విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో చంద్రబాబు నాయుడుతో కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details