ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రైతు ఉద్యమం తర్వాత.. ప్రైవేటీకరణపై దేశ వ్యాప్త పోరాటం'

విశాఖ స్టీల్​ ప్లాంట్​ను ప్రైవేట్ పరం చేయాలనే కేంద్ర ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు ఐఎన్​టీయూసీ నేత సంజీవరెడ్డి అన్నారు. దిల్లీలో రైతు ఉద్యమం అనంతరం.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్న అంశంపై పోరాటం మొదలవుతుందని చెప్పారు.

By

Published : Feb 1, 2021, 11:53 AM IST

Published : Feb 1, 2021, 11:53 AM IST

It is against the central idea to privatize the Visakhapatnam steel plant
'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయాలనే కేంద్ర ఆలోచనకు వ్యతిరేకం'

విశాఖ స్టీల్ ప్లాంట్​ను ప్రైవేటు పరం చేయాలనే కేంద్రం ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్టు ఐఎన్​టీయూసీ నేత సంజీవరెడ్డి చెప్పారు. కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాభాల బాటలో ఉన్న కేంద్ర కంపెనీలను ప్రైవేట్ వారికి ఇస్తే నిరుద్యోగ సమస్య వస్తుందని చెప్పారు.

భాజపా ప్రభుత్వం కేవలం ప్రైవేట్ పెట్టుబడి దారుల మేలు మాత్రమే చూస్తోందని ఆరోపించారు. దిల్లీలో రైతు ఉద్యమం అనంతరం.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కంపెనీలు ప్రైవేట్ పరం చేస్తున్న అంశంపై పోరాటం మొదలవుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details