ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 16, 2020, 9:59 PM IST

ETV Bharat / state

రేపే.. ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ పున:ప్రారంభం

కరోనా కారణంగా ఏడునెలల పాటు మూసివేసిన విశాఖ ఇందిగాంధీ జూలాజికల్ పార్క్​ను మంగళవారం తెరవనున్నారు. ఈ మేరకు సందర్శకులకు అనుమతినిస్తూ అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాటు చేసిన గుర్తులు
భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాటు చేసిన గుర్తులు

విశాఖలో కరోనా నిబంధనల కారణంగా ఏడునెలల పాటు మూసేసిన ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్​ మంగళవారం తెరుచుకోనుంది. జంతుప్రదర్శన శాలలో సందర్శకులకు అనుమతినిస్తూ అటవి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సందర్శకులు నేరుగా కౌంటర్ల ద్వారా లేదా ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

సందర్శకులు కొవిడ్ నియామాలు పాటించాలని తెలిపారు. ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు. జూ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్కాన్ , శానిటైజర్ అందుబాటులో ఉంచారు. జూ అధికారిక వెబ్ సైట్ లో కూడా టికెట్లను పొందవచ్చునని, విశాఖ జూ క్యూరేటర్ నందిని సలారియా ప్రకటించారు.

ఇదీ చదవండి

100 కిలోల గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details