ఆంధ్రప్రదేశ్

andhra pradesh

steel plant privatization: 'వైకాపా నేతలు మొసలి కన్నీరు కార్చడం మానుకోండి'

By

Published : Oct 10, 2021, 8:09 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​(visakha steel plant privatization news) విషయంలో వైకాపా ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రపై పోరాడటంలో చిత్తశుద్ధిగా వ్యవహారించటం లేదని దుయ్యబట్టారు.

former TDP MLA Palla Srinivasa Rao
former TDP MLA Palla Srinivasa Rao

విశాఖ స్టీల్ ప్లాంట్​(visakha steel plant privatization news) విషయంలో కేంద్రంపై వైకాపా చిత్తశుద్ధితో పోరాటం చేయాలని తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు(TDP leader Palla Srinivasa Rao fires on ycp govt). ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో చేపట్టిన నిరసన దీక్షలో మాట్లాడిన ఆయన.. ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలన్నారు. రిలే నిరాహార దీక్షా శిబిరాల వద్దకు వచ్చి వైకాపా నేతలు మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హితవు పలికారు.

గతంలో స్టీల్ ప్లాంట్ బీఐఎఫ్ఆర్​కు వెళ్లిన సమయంలో.. అప్పటి సీఎం చంద్రబాబు(chandrababu news) ప్రధానమంత్రి వాజ్​పేయ్ సర్కార్​పై ఒత్తిడి చేసి 1350కోట్లను రుణమాఫీ చేయించారని గుర్తు చేశారు. నాడు స్టీల్ ప్లాంట్​ను కాపాడిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. దసరా తర్వాత తెదేపా ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ పోరాటం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details