ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 6, 2020, 1:51 PM IST

ETV Bharat / state

మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి విరాళాలు

విశాఖ జిల్లా పెద్ద బొడ్డేపల్లి గ్రామ మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి వైకాపా నేత గుడివాడ లక్ష్మీరామ్ లక్షా నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

donation for maridimamba temple construction
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి గ్రామ మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి పలువురు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. వైకాపా నేత గుడివాడ లక్ష్మీరామ్ తన సహాయం కింద రూ.1,00,116 విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

మరిడిమాంబ ఆలయ నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు విజయ్ కుమార్, దేవాలయ కమిటీ సభ్యులు ఈశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details