మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని పార్లమెంట్ మాజీ సభ్యుడు సబ్బం హరి అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవ ఒక ఎత్తైతే... దేశానికి ఆయన అందించిన విలువైన సంప్రదాయం... నేటి, భవిష్యత్ తరాలకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని హరి అభిప్రాయపడ్డారు. ప్రణబ్ ముఖర్జీతో తనకు కలిగిన అనుభవాలను ఆయన పంచుకున్నారు.