ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు శారదాపీఠానికి ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ వెళ్లనున్నారు. ఈనెల 8న జరిగే మంత్రివర్గ విస్తరణ కోసం సలహాలు, సూచనల కోసం స్వరూపానంద స్వామిని కలవనున్నారు.

By

Published : Jun 3, 2019, 11:17 AM IST

Updated : Jun 4, 2019, 5:21 AM IST

రేపు విశాఖకు ముఖ్యమంత్రి జగన్!

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు విశాఖలో సీఎం జగన్.. స్వరూపానందను కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్... ముహూర్తంపై స్వామి సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్ స్వరూపానందను దర్శించుకోలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా స్వరూపానంద స్వామినే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్వరూపానంద స్వామిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 4, 2019, 5:21 AM IST

ABOUT THE AUTHOR

...view details