ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్​కు ప్రణాళిక సిద్ధం'

విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్​కు ఏడీబీ అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో వెల్లడించారు.

By

Published : Jul 20, 2019, 1:15 AM IST

Updated : Jul 20, 2019, 4:09 AM IST

పీయూష్ గోయల్

విశాఖ- చెన్నై పారిశ్రామిక నడవాకు ఏడీబీ(ఏసియన్ డెవలప్​మెంట్ బ్యాంకు) అభివృద్ధి ప్రణాళిక సిద్ధమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఈస్ట్​కోస్ట్ ఆర్థిక కారిడార్​లో భాగంగా కేంద్ర ప్రతిపాదనలో అభివృద్ధి కేంద్రాలుగా విశాఖ, మచిలీపట్నం, చిత్తూరు, దొనకొండ గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత విశాఖ, చిత్తూరును చేపట్టాలని ఏపీ నిర్ణయించిందని... ఈ రెండు నగరాల కోసం ఇప్పటికే ఏడీబీ మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసిందని గోయల్‌ వెల్లడించారు.

Last Updated : Jul 20, 2019, 4:09 AM IST

ABOUT THE AUTHOR

...view details