ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషం తాగిన తల్లీకూతుళ్లు...ఆస్పత్రికి తరలిస్తుండగా..

పెందుర్తిలో ఘోరం జరిగింది. తల్లి, కుమార్తె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

By

Published : Sep 21, 2019, 11:19 PM IST

విషాదం

తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం..

విశాఖ జిల్లా పెందుర్తిలోని గోకుళదామ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన లక్ష్మీ, ఆమె కుమార్తె గిరిజా ప్రసన్నరాణి ఆత్మహత్యాయత్నం చేశారు. వాటర్ క్యాన్లు తెచ్చే వ్యక్తి తలుపు కొట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి తెలిపాడు. వారు తలుపులు తెరిచి చూడగా తల్లీ, కుమార్తె స్పృహ కోల్పోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కేజీహెచ్​కు తరలించగా.. మార్గమధ్యలో తల్లి లక్ష్మీ మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పెందుర్తి ఎస్​ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details