ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 10:08 AM IST

ETV Bharat / state

ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురికి కరోనా

విశాఖ గాయత్రినగర్​లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురికి కరోనా సోకింది. ఒక్కసారిగా ఈ కేసులు వెలుగుచూడటంపై విశాఖ ఉలిక్కిపడింది. అధికారులు అప్రమత్తం అయ్యారు.

A coronavirus that infects all five of the same family in gayathrinagar vizag
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురికి సోకిన కరోనా

విశాఖపట్నం మధురవాడలోని గాయత్రి నగర్​లో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకింది. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి.. రంజాన్ సందర్భంగా తన కుటుంబంతో కలిసి బందువుల ఇంటికి వెళ్ళి మంగళవారం తిరిగి వచ్చాడు.

మరుసటి రోజు వాలంటీర్లు వీరి నుంచి నమూనాలు సేకరించి ఆస్పత్రికి తరలించగా అయిదుగురికి కొవిడ్ సోకినట్లు తేలింది. ఒక్క సారిగా ఈ కేసులు వెలుగుచూడటంరై అధికారులు... చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఆ ప్రాంతంలో క్రిమి సంహారక ద్రావణాన్ని పిచికారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details