ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"వైఎస్‌ఆర్‌ బీమా"పై వాలంటీర్ ఆవేదన.. మౌనం వహించిన మంత్రి!

By

Published : May 23, 2022, 4:23 PM IST

వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని కుటుంబంలో ఒక్కరికే వర్తింపజేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారని మంత్రి ధర్మాన ఎదుట ఓ వాలంటీర్​ ఆవేదన వ్యక్తం చేశారు. పథకాన్ని సరిగ్గా అమలు చేయడంలేదంటూ వాలంటీర్​ అన్న మాటలకు మంత్రి మౌనం వహించారు.

Volunteer
వైఎస్‌ఆర్‌ భీమా పథకం అమలుపై వాలంటీర్

వైఎస్‌ఆర్‌ భీమా పథకాన్ని కుటుంబంలోని ఒక వ్యక్తికే అమలుచేయడం వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని ఓ వాలంటీర్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేంవలస సచివాలయంలో అధికారులు, వాలంటీర్లతో మంత్రి ధర్మాన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల తీరుపై వాలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ భీమా పథకం అమలు సరిగాలేదంటూ మంత్రికి ఎర్రన్నాయుడు అనే వాలంటీరు వివరించారు. ఒక కుటుంబంలో ఒకరికే అమలు వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. వాలంటీర్‌ మాటలకు సమాధానం చెప్పలేక.. మంత్రి మౌనంగా ఉండిపోయారు.

ABOUT THE AUTHOR

...view details