ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళికట్టిన పెళ్లి కూతురు

మూడు ముళ్ల బంధంతో వధూవరులు ఒక్కటయ్యే పెళ్లిలో... తాళి బొట్టు ప్రత్యేకతే వేరు. ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం.... ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం. కానీ ఓ గ్రామంలో... వధూవరులు ఇరువురు ఒకరికొకరు తాళీ కట్టుకుంటేనే పెళ్లి అవుతుంది.

By

Published : Mar 14, 2019, 6:10 AM IST

Updated : Mar 14, 2019, 6:27 AM IST

తాళికట్టిన పెళ్లి కూతురు

తాళికట్టిన పెళ్లి కూతురు

మూడు ముళ్ల బంధంతో వధూవరులు ఒక్కటయ్యే పెళ్లిలో... తాళి బొట్టు ప్రత్యేకతే వేరు. ఆ తాళిని వరుడు-వధువు మెడలో కట్టడం సంప్రదాయం...
శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవు గ్రామస్తులకు ఈ సంప్రదాయం కాస్త వేరు. ఆ ఊర్లో జరిపే పెళ్లిల్లో వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు తాళి కట్టుకుంటారు. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. ఎంతో కాలంగా వస్తోన్న ఆనవాయితీ ప్రకారం, ప్రతి రెండేళ్ల కోసారి సామూహిక వివాహాలు జరుపుతుంటారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం మొదట వధువు మెడలో వరుడు తాళి కడతాడు. తర్వాత బంగారంతో చేసిన ధాన్యపు గింజను వరుడి, మెడలో వధువు కడతుంది.
దశాబ్దాల కాలం నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఈ సంవత్సరం సాముహిక వివాహాల్లో భాగంగా 25 జంటలకు పెళ్లి చేశారు. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని పాటిస్తున్నామని స్థానికులు తెలియజేస్తున్నారు.

Last Updated : Mar 14, 2019, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details