శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే వంతెన వద్ద మహేంద్రతనయ నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నది ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని పరివాహక ఒడిశా ప్రాంతం నుంచి ఈ మృతదేహం వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహేంద్రతనయ నదిలో ఆ మృతదేహం ఎవరిది..?
పాతపట్నం రైల్వే వంతెన వద్ద నదీప్రవాహంలో మృతదేహం కొట్టుకువచ్చింది. మహేంద్రతనయ నదిలో మృతదేహం గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహేంద్రతనయ నదిలో మృతదేహం