ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాసమస్యలు తెలుసుకోవడానికే పల్లెనిద్ర

క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యల్ని తెలుసుకోవడం కోసం పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్​ శ్రీకారం చుట్టారు. వంగర మండలంలోని సీతారాంపురంలో పర్యటించిన ఆయన పలు సమస్యలపై స్థానికులతో మాట్లాడారు.

By

Published : Jul 25, 2021, 3:23 PM IST

pallenidra
పల్లెనిద్ర

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ తెలిపారు. వంగర మండలం ఎం సీతారాంపురం గ్రామంలోని బాలుర వసతి గృహంలో శనివారం రాత్రి ఆయన బస చేశారు.

తొలుత గ్రామస్థులతో ఆయన సమావేశం నిర్వహించి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం సిబ్బంది పనితీరు పై ఆరా తీశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, గ్రామంలో ఆధార్​ సేవ ఏర్పాటు చేయాలని, అర్హత ఉన్న మహిళలకు చేయూత పథకం అందలేదని స్థానికులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

సచివాలయం నిర్మాణాలు, ఆర్​బీకే నిర్మాణాల వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్​ సూచించారు. తాను రాత్రి వసతి గృహంలో ఉంటానని, గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ఉదయం వినతిపత్రం రూపంలో తనకు అందించాలని తెలిపారు. ఆయన వెంట పాలకొండ ఆర్డీవో కుమార్, డీఎస్పీ శ్రావణి, అధికారులు ఉన్నారు.

ఇదీ చదవండి:Srikakulam district fishermen: ఆ 15 గంటలూ.. క్షణమొక యుగంలా...!

ABOUT THE AUTHOR

...view details