శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నడిబొడ్డున పశువధ కేంద్రం నిర్వహణను అధికారులు గుర్తించారు. నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న పచౌరి కాలనీలో రెండు పశువధ కేంద్రాలపై మంగళవారం సాయంత్రం అధికారులు దాడి చేశారు. అప్పటికే ఈ రెండు కేంద్రాలు మూసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులను పిలిపించి హెచ్చరికలు చేశారు. ఈ కేంద్రాలు చెరువును ఆక్రమించుకొని నిర్మించడం గమనార్హం.
పశువధ కేంద్రాలను వారంలో నాలుగు రోజుల పాటు తెరిచి పశువులను హతమార్చి మాంసాన్ని విక్రయిస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అనుమతులు లేకుండా పశువధ కేంద్రాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూర్మ నాయకులు అన్నారు.