రజకుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దక్కుతుందని రాష్ట్ర రజకుల సంఘ ఐక్యవేదిక అధ్యక్షుడుపాతపాటి అంజిబాబు శ్రీకాకుళం జిల్లా రాజాంలో అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం అదరణ పథకం కింద 16లక్షల యూనిట్లుఇచ్చారన్నారు. సీఎం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే మళ్లీ చంద్రబాబునే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని స్పష్టంచేశారు. రాజాం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన కొండ్రు మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవీ చదవండి..