ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్రిక్తం... కరణం బలరాంను అడ్డుకున్న వైకాపా శ్రేణులు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ప్రకాశం జిల్లా చీరాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కరణం బలరాం​ను వేడుకల్లో పాల్గొనకుండా...​వైకాపా నేతలు అడ్డుకున్నారు.

By

Published : Aug 15, 2019, 11:24 AM IST

Updated : Aug 15, 2019, 11:54 AM IST

wat_Between_tdp_And_ycp

వేడుకల వేళ..కరణం బలరాంను వైకాపా శ్రేణుల అడ్డగింత!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కరణం బలరామకృష్ణమూర్తి చీరాలలో తహశీల్దార్​ కార్యాలయానికి వచ్చారు. వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేడుకల్లో పాల్గొనవద్దంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపటికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పెద్ద ఎత్తున అనుచరులతో కార్యాలయానికి చేరుకున్నారు. ఓ వైపు తెదేపా శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చారు. ఇరు పార్టీల శ్రేణుల మధ్య కాస్త వివాదం నడించింది. తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. ఎమ్మెల్యే బలరాం తహశీల్దార్​ కార్యాలయం నుంచి చీరాల ఆర్​ అండ్ బీ అతిథి గృహానికి వెళ్లడంతో వైకాపా కార్యకర్తలూ అక్కడకు చేరుకున్నారు.

Last Updated : Aug 15, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details