ప్రకాశం జిల్లా పర్చూరు సమీపంలో రోడ్డుపై భారీ ప్రమాదం తప్పింది. పర్చూరు- చిలకలూరిపేట రహదారిలోని వై జంక్షన్ వద్ద ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో కారులోని వారంతా కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారు వేటపాలెంకు చెందినవారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.
కారులో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం
రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు రేగాయి. కారులోని వారంతా కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది.
The car on the road was suddenly burnt and the car was hit by a fire at parchiru in prakasham district