అద్దంకిలో జరిగిన రెవెన్యూ అధికారులు సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అధికారులు ఆరోజు అందుబాటులో ఉండి ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కారం అయ్యేట్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం అవడంతోపాటు భవిష్యత్తులో అర్జీల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్ పోలా భాస్కర్
అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ పోలా భాస్కర్ సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒంగోలు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అద్దంకిలో రెవిన్యూ అధికారులు సమీక్ష